Thursday, March 17, 2011

చిత్తరాల పూలతోట

madhu-d1ఏడు పదుల వయసుకు దగ్గరౌతున్నా...ఆయన కుంచెకు వన్నె తగ్గదు...ఆయన చిత్రాలకు ఖ్యాతి తగ్గదు...పల్లె పడచుల పైట అందం...పైరగాలుల తన్మయత్వం...ఆత్మీయానుబంధాల మేళవం...అన్నీ కలగలిపితే తోట వైకుంఠం అవుతుంది. తెలంగాణ ప్రాంతానిేక తలమానికంగా భాసిల్లుతున్న తోటవైకుంఠం భావోద్వేగాలను పలికింపజేసే చిత్రాలకు చిరునామాగా చెబుతారు. ప్రఖ్యాత సామాజిక స్పృహ కలిగిన మేటిదర్శకుడు బి.నరసింగరావు తన చిత్రాలకు సంబంధించిన ఆర్ట్‌ వర్క్‌ అంతా తోట వైకుంఠానిక అప్పగించేవారు. 1942లో కరీంనగర్‌లో పుట్టిన తోట వైకుంఠం చిత్రకళాకారుడిగా అనన్యసామాన్యమైన పేరును సంపాదించుకున్నారు.

కిరాణాకొట్టు నడిపిస్తూ కుటుంబ భారాన్ని నెట్టుకొస్తున్న సామాన్యమైన వ్యక్తి ఆయన తండ్రి. కరీంనగర్‌ జిల్లాకు చెందిన బూరుగుపల్లి ప్రాంతంలో పుట్టిన తోట వైకుంఠం చిన్నప్పటినుంచి కూడా సాదాసీదా జీవనాన్ని కొనసాగిస్తుండేవారు. చిన్నతనంనుంచి కూడా తోట వైకుంఠానికి తాను పుట్టిన ప్రాంతమన్నా...పల్లెవాతావరణమన్నా ఎంతో మక్కువ. అందుకే ఆయన గీసిన చిత్రాలలో ఆయనకున్న అభిరుచిని తెలియజేస్తాయి ఆ చిత్రాలు.

madhu-dతన అభిరుచికి తగినట్లుగానే విద్యను కూడా అదే మార్గంలో కొనసాగించారు వైకుంఠం. అందుకు తండ్రి కూడా ఎటువంటి అభ్యంతరమూ పెట్టలేదు. ఎటువంటి షరతులు కూడా విధించలేదు. కొడుకు ఇష్టప్రకారమే చదివించారు. తోట వైకుంఠం తన అభిరుచికి తగినట్లుగా ఫైన్‌ ఆర్ట్‌‌స, ఆర్కిటెక్చర్‌ కోర్సులను హైదరాబాద్‌లో పూర్తిచేశారు. ఫైన్‌ ఆర్ట్‌‌స విద్యార్థులకు బోధకునిగా కొన్ని విద్యాసంస్థలలో పనిచేశారు.

తెలంగాణ సంస్కృతి మనకు ఆయన చిత్రాలలో అణువణువూ స్మృజిస్తుంది. దాసి చిత్రానికిగాను వైకుంఠం కళాదర్శకునిగా పనిచేశారు. ఆ చిత్రానికి కేంద్రస్థాయిలో ఉత్తమ కళాదర్శకునిగా తోట వైకుంఠం అవార్డును అందుకోవడం విశేషం. ‘రంగుల కల’ చిత్రం ఓ చిత్రకారుని గురించిన అంశం. ఆ చిత్రాన్ని దర్శకుడు బి.నరసింగరావు ఎంతో హృద్యంగా తెరకెక్కించిన తీరు నభూతో నభవిష్యతి. ఇక ఆ చిత్రకారుడు గీసే బొమ్మలన్నీ సినిమా తెర వెనక గీసిన వ్యక్తి తోట వైకుంఠం. ఆ సినిమా కూడా జాతీయస్థాయిలో గుర్తింపు తెచ్చుకుంది. అందుకే నరసింగరావు తన ప్రతిచిత్రంలోనూ ఏదోఒకరకంగా తోట వైకుంఠం పాల్గొనేలా చేస్తారు. వాళ్లిద్దరి మధ్య ఉన్న అనుబంధం అలాంటిది. వైకుంఠానికి ఇద్దరు కూతుళ్లు, ఒక కుమారుడు ఉన్నారు. చెట్టూ పుట్టా తిరిగి కాయకష్టం చేసి అలసి, సొలసిన శ్రమజీవులు మానసిక విశ్రాంతిని, పొందడానికి కళలను నమ్ముకొని తెలంగాణలో వేలాది మంది కళాకారులు బ్రతుకు బండిని కొనసాగించేవారు. ఇలాంటి ప్రాశస్త్యం కల్గిన విశిష్ఠ కళలతో పరవశించే తెలంగాణ పల్లెల ప్రకృతి అందాలను తోట వైకుంఠం తన కుంచెతో మన మనసుల్లో నిలిచిపోతారు.

నండూరి రవిశంకర్‌

No comments: