Thursday, May 19, 2011

అశేష కీర్తి గిరి చిత్రాలు * కొండపల్లి శేషగిరిరావు

seshagiri_pic3
కొండపల్లి బొమ్మలు ఈ తరం వారికి కొత్తేమోగానీ పాతతరం వాళ్ల ఇళ్లల్లో కొలువుతీరి ఉంటాయి ఆ కొయ్యబొమ్మలు. ప్రత్యేకించి బొమ్మల కొలువుల్లో కొండపల్లి బొమ్మలు ఉండితీరాల్సిందే. అంతలా ప్రాచుర్యం పొందిన కొండపల్లి బొమ్మలు చూడటానికి అచ్చం కొండపల్లి శేషగిరిరావు గీసిన బొమ్మల్లానే ఉంటాయి. అంతలా జీవకళ ఉట్టిపడుతుంటుంది శేషగిరిరావుగారి కళాత్మక చిత్రాలలో. ఆదరణ కరవై కొండపల్లి బొమ్మలకు గిరాకీ తగ్గిందిగానీ అంతర్జాతీయ స్థాయికి ఏ మాత్రం తగ్గవు కొండపల్లి బొమ్మలు. అంతగా గుర్తుకుతెచ్చే కొండపల్లినే ఇంటిపేరుగా చేసుకుని శేషగిరిరావు అనే ప్రసిద్ధ చిత్రకారుడు తన విశేష పేరుప్రతిష్టలు ఒక్క ఆంధ్రప్రదేశ్‌కే పరిమితం చేయక యావత్‌ భారతావని మెచ్చే స్థాయికి వ్యాప్తిచెందడమంటే అంత తేలికైన విషయం కాదు. ఎనిమిది పదుల వయసులోనూ వన్నెతగ్గని కళాఖండాలను ఎంతో సృజనాత్మకంగా తీర్చిదిద్దుతుంటారు ఆయన. ఇంటిపేరు కొండపల్లి అయినా శేషగిరిరావు పుట్టింది మాత్రం తెలంగాణకే తలమానికమైన పోరుగడ్డ వరంగల్‌ జిల్లాలోని పెనుగొండలో 1924 సంవత్సరంలో జన్మించారు. పెనుగొండలో ప్రాధమిక విద్యాభ్యాసం చేసి వరంగల్‌ ప్రాంతంలో ఉన్నత విద్యను అభ్యసించారు ఆయన.

seshagiri_pic 

లైఫ్‌ ఆఫ్‌ ఆంధ్రా : పౌరాణిక, దృశ్య కావ్య నాయకానాయికలను, మనసుకు హత్తుకుపోయే వివిధ సుందర దృశ్యాలను మనోహరంగా చిత్రించడమేకాక కుడ్య చిత్రలేఖనంలో కూడా శేషగిరిరావుకు సాటి ఆయనే అనిపించుకొన్నారు. కొండపల్లి వేసిన బొమ్మలు పరోక్షంగా ఎంతో మందికి స్ఫూర్తినిచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. ‘లైఫ్‌ ఆఫ్‌ ఆంధ్ర’ అనే అతి బృహత్తర చిత్రం అనేక ప్రభుత్వ కార్యక్రమాలలో వేదిల మీద మనకు కనిపిస్తుంటాయి. ప్రతి ఒక్కరూ ఏదో ఒక సందర్భంలో వాటిని చూడటం తటస్తించివుంటుంది. కాకపోతే చాలామందికి ఆయన పేరు మాత్రం తెలియదు. టీవీ ఛానల్స్‌, వార్తాపత్రికల ద్వారా, మీడియా ద్వారా రాష్ట్రంలోని ప్రజలు ఏదో ఓ సందర్భంలో ఆ చిత్రాన్ని తిలకించి ఉంటారు.అయితే ఆ చిత్రం ‘కొండపల్లి’ శేషగిరిరావుదే అన్న విషయం మాత్రం చాలా మందికి తెలియనే తెలియదు.

seshagiri_pic1 

సైన్స్‌ మాస్టార్‌ స్ఫూర్తి : కోటిరత్నాల వీణ తెలంగాణలో వేయిస్తంభాల గుడి, అరుదైన చారిత్రక కళాసంపదను చాటుతున్న వరంగల్‌ ప్రాంతంలో జన్మించిన కొండపల్లి శేషగిరిరావు చిన్నతనంలోనే సామాన్యశాస్త్రంలో గీయవలసిన బొమ్మల్ని తన పాఠ్యపుస్త్తకంలో ఉన్నదానికన్నా ఎంతో అందంగా చిత్రించేవారు. చిన్నతనంలోనే కొండపల్లి శేషగిరిరావులో ఉన్న సృజనాత్మకతను పరిశీలించిన ఆ పాఠశాల డ్రాయింగ్‌ మాస్టర్‌ అయిన దీనదయాళ్‌ ఆనాడే కొండపల్లి గొప్ప కళాకారుడవుతాడని గ్రహించారు. దీంతో కొండపల్లి కళాచతురతను ప్రప్రథమంగా ఆ పాఠశాల డ్రాయింగ్‌ టీచరు దీనదయాళ్‌ గుర్తించారు. పెన్సిల్‌తో ఏ రేఖలు ఎలా గీయాలో, కుంచెతో ఏ రేఖల్లో జీవం ఎలా నింపాలో దీనదయాళ్‌ సార్‌ మన కొండపల్లికి నేర్ఫారు. చుట్టూ వ్యాపించి ఉన్న కళాసంపద ఆయన కళాభిమానాన్ని తట్టిలేపింది. వేయిస్తంభాల గుడిలోని ప్రతిస్తంభం ఆయనకు రోజుకో పాఠం చెప్ఫింది. రామప్ఫ గుడి ఆయన్ని తన హృదయాంతరాలలో నింపుకుంది. ఆ గుడిలోని శిల్ప సౌందర్యం..శిల్పక్షేత్రాల శిల్ఫకళా సొగసులను సుదీర్ఘ, సునిశిత అధ్యయనంతో తన సొంతం చేసుకొన్న కొండపల్లి వాటినుంచి స్ఫూర్తిపొంది కొన్నివందల చిత్రాలతో ఆ శిల్ఫకళకు దర్ఫణం పట్టారు. శిల్ఫుల మనోగతాల్ని, వారి అభిరుచిలో తొంగిచూసిన ప్రత్యేకతల్ని, విశిష్టతల్ని తాను అవగతం చేసుకోవడమే కాక ప్రజాబాహుళ్యానికి చాటే ప్రయత్నం చేశారు.

seshagiri_pic2 

వరంగల్‌లో విద్యాభ్యాసం, చిత్రకళాభ్యాసం తర్వాత ఆయన హైదరాబాద్‌కు చేరుకొన్నారు. హైదరాబాద్‌ చిత్రకళాశాలలో డిప్లొమా పొందారు. హైదరాబాద్‌లో ఉన్న సమయంలోనే ఆయనకి నవాజ్‌ మిహిది నవాజ్‌తో పరిచయం కలిగింది. కొండపల్లి చిత్రకళా ప్రతిభ గుర్తించిన నవాజ్‌ రవీంద్రనాథ్‌ ఠాగూర్‌ స్థాపించిన శాంతినిేకతనంలో అధునాతన చిత్రకళా రీతుల్ని అధ్యయనం చేయడంవల్ల తగిన ఫలితం ఉంటుందని సూచించి, సహకరించడంతో కొండపల్లి ‘శాంతినిేకతన్‌’లో ప్రవేశించారు. సర్వకళలకు పుట్టినిల్లయిన శాంతినిేకతన్‌లో అప్పుడు నంద్‌లాల్‌బోస్‌ చిత్రకళా విభాగంలో ఉండేవారు. ఆయన కొండపల్లి కళాప్రతిభని గుర్తించారు. పాటించాల్సిన జాగ్రత్తలేమిటో నేర్ఫారు. ఆయన నేర్ఫిన మెలకువలతో కొండపల్లి ప్రతిభ బాగా వికసించింది. అక్కడే ‘కుడ్య’ చిత్రలేఖనంలో కూడా కొండపల్లి ప్రత్యేక శిక్షణ పొందారు. 1950లో హైదరాబాద్‌లో చిత్ర కళాపోటీలు భారీఎత్తున జరిగాయి. అఖిలభారత స్థాయిలో జరిగిన ఆ పోటీల్లో కొండపల్లి చిత్రం ప్రథమ బహుమతి సొంతం చేసుకొంది. ఆ సభలో పాల్గొన్న అప్ఫటి మంత్రి, కొండపల్లి చిత్రాన్ని ప్రశంసించడమే కాక హైదరాబాద్‌ స్కూల్‌ ఆఫ్‌ ఆర్ట్‌‌స అండ్‌ క్రాఫ్ట్‌‌సలో అధ్యాపకుడిగా కొండపల్లి శేషగిరిరావు పేరును ప్రతిపాదించారు.

అలా ఉద్యోగం చేపట్టిన కొండపల్లి శేషగిరిరావు ఎంతోమంది శిష్యులను తయారు చేశారు. ఆయన కళాత్మకత రాజకీయ నాయకులను విశేషంగా ఆకట్టుకోవడంతో హైదరాబాద్‌, బెంగళూరు, భావనగర్‌లలో జరిగిన ఆలిండియా కాంగ్రెస్‌ కమిటీ సమావేశాలకు ద్వారాలు, వేదిక రూపకల్ఫన బాధ్యతలు కొండపలిే్లక అప్ఫగించారు. అవి అప్ఫటి ప్రధానమంత్రుల అభినందనలు అందుకొన్నాయి. అప్ఫటి ప్రభుత్వం చొరవతోనే ఆయన ‘‘లైఫ్‌ ఆఫ్‌ ఆంధ్ర’’ అనే బృహత్తర చిత్రాన్ని చిత్రించారు. అది అనేక పర్యాయాలు రవీంద్రభారతి, తెలుగు లలిత కళాతోరణం వంటి వేదికల మీద జరిగిన కార్యక్రమాల్లో ప్రదర్శితమై ప్రేక్షకులను బాగా ఆకర్షించింది. ఆయన ఉపాధ్యాయుడిగానే మిగిలిపోకుండా చిత్రకళా విస్తృతికి తానెంతో కృషిచేశారు. పత్రికల్లో విరివిగా వ్యాసాలు రాశారు. చిత్రకళకు సంబంధించిన దాని అనుబంధ కళలపై ఎన్నో గ్రంథాలు కూడా రాశారు. 1982లో ఉద్యోగ విరమణ అనంతరం కూడా తన దగ్గరకొచ్చే వారిని నిరాశపరచక మెలకువలన్నీ నేర్ఫారు. 1987 మే ఆరో తేదీన హైదరాబాద్‌లో ‘మాడపాటి సుకుమార్‌’ అవార్డు అందుకొన్న కొండపల్లి చిత్రకళా సాధన, బోధనల్లో ‘కొండపల్లి బొమ్మలంత’ సుస్థిర కీర్తిప్రతిష్టలను పొందారు.

మాస్కో, లండన్‌, అమెరికా దేశాలలో శేషగిరిరావు చిత్రాల ఆర్ట్‌ ఎగ్జిబిషన్లు జరిగాయి. లలిత కళా అకాడమీ ఫెలోషిప్‌ పొందిన శేషగిరిరావు తన జీవిత ధ్యేయం పౌరాణిక చిఙత్రాలను ఎంతో హృద్యంగా చిత్రీకరించడమేనంటారు. కాళిదాసుని అభిజ్ఞాన శాకుంతలానికి సంబంధించిన సుమనోహర చిత్రాలు శేషగిరిరావుకు ఎంతగానో ఖ్యాతిని తెచ్చిపెట్టాయి.

-నండూరి రవిశంకర్‌

No comments: